TRINETHRAM NEWS

Trinethram News : Apr 08, 2024,

BRS మాజీ ఎమ్మెల్యే కుమారుడు అరెస్ట్
బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ప్రజా భవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రహేల్ నిందితుడిగా ఉన్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత రహేల్ దుబాయ్ పారిపోయాడు. నేడు శంషాబాద్ ఎయిర్ పోర్టులో పోలీసులు అరెస్ట్ చేశారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోగానే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.