
పెద్దపల్లి జిల్లా మార్చి-16// త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కునారం గ్రామంలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేణుకా ఎల్లమ్మ తల్లి పట్నాల మహోత్సవం సందర్భంగా ఈరోజు పోచమ్మ తల్లి బోనాల కార్యక్రమంలో పాల్గొని పోచమ్మ తల్లిని దర్శించుకొని అమ్మవార్లకు ప్రత్యేక పూజ నిర్వహించి, అమ్మ వారి ఆశీస్సులు తీసుకున్న బీజేపీ రాష్ట్ర యువ నాయకులు ఏగోలపు సదయ్య గౌడ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోచమ్మ తల్లి దీవెనలతో నియోజకవర్గంలోని ప్రజలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో,సుఖ సంతోషాలతో,పాడి పంటలతో సువిశాలంగా ఉండాలని కోరారు.
ఇట్టి గౌడ సంఘం అధ్యక్షులు ఇల్లందుల రాములు, సుద్దాల శ్రీనివాస్, ఇల్లందుల మల్లేశం, బందారపు మల్లయ్య, నారగొని లక్ష్మణ్ మరియు బీజేపీ నాయకులు కోడూరి పెద్ద శ్రీనివాస్, నారగొని శ్రీనివాస్, కోడూరి ఆంజనేయులు, బుర్ర ఐలయ్య, కోడూరి బాపు,ఇల్లందుల మల్లేష్, కోడూరి పెద్ద శంకర్, సుద్దాల శ్రీనివాస్, ఇల్లందుల అశోక్ మరియు అధిక సంఖ్యలో భక్త్తులు పాల్గొన్నారు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
