TRINETHRAM NEWS

అద్భుతం.. 5వేల వజ్రాలతో అయోధ్య మందిర నమునా నెక్లెస్

గుజరాత్లో వజ్ర వ్యాపారి కౌశిక్ కాకడియా ఏకంగా అయోధ్య రామమందిర నమూనా నెక్లెస్ను రూపొందించారు. దీని తయారీకి 5వేల అమెరికన్ వజ్రాలు, 2 కేజీల వెండిని ఉపయోగించినట్లు ఆయన చెప్పారు. 35 రోజుల్లో 40 మంది కళాకారులు ఈ అద్భుతమైన నెక్లెస్ను రూపొందించినట్లు కార్తీక్ వెల్లడించారు. ఈ నెక్లెస్ను అమ్మే ఉద్దేశం లేదన్నారు. దీనిని అయోధ్య మందిరానికి బహుమతిగా ఇస్తామని ఆయన చెప్పారు.