TRINETHRAM NEWS

అయోధ్య రామ మందిర ప్రతిష్ట మహోత్సవ శోభాయాత్ర …

బాపట్ల జిల్లా, పిట్టల వాని పాలెం మండలం ఖాజిపాలెం గ్రామం లో ఈ నెల 22 వ తేదీ సోమవారం నాడు అయోధ్య లో రామమందిర ప్రతిష్ట మహోత్సవం ను పురస్కరించుకొని 21వ తేదీ ఆదివారం నాడు రాముల వారి అక్షతలు శోభాయాత్ర గా బాపట్ల నియోజకవర్గం పిట్టల వాని పాలెం మండలం లోని అన్ని దేవాలయాల వద్దకు వెళ్ళి అక్షింతలు సమర్పించడం జరుగుతుంది అని ఈ కార్యక్రమం లో భక్తులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి అని కార్యక్రమ నిర్వహణ కమిటీ వారు తెలియ చేసారు.
ఈ సమావేశం లో దెందుకూరి రామ రాజు , కుసంపుడి దేవేంద్ర రాజు, గోకరాజు సుబ్బ రాజు, కొత్తపల్లి దనుంజేయ వర్మ , అనంత చక్రవర్తి, బృందావనం గోపి చంద్, తోటకూర శ్రీనివాస రాజు, కనుమూరి మురళి, విజయ రామ గోపాల్, చింటు తదితరులు పాల్గొన్నారు