Guru Purnima : పౌర్ణమి తేజంతో వెలిగిన అనపర్తి ఔదుంబర పీఠం

TRINETHRAM NEWS

అనపర్తి : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి లో ఉన్న ఆర్కే ఎగ్ గోడౌన్స్ వద్ద నెలకొన్న ఔదుంబర దత్త పీఠం ఆధ్యాత్మిక ప్రకాశంతో వెలిగింది.గురు పౌర్ణమి సందర్భంగా భక్తి, శ్రద్ధల మేళవింపుతో సత్య దత్త వ్రతం, దత్త రక్ష మంత్ర హోమం వంటి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి.
ఈ మహోత్సవానికి మల్లిడి సత్యనారాయణరెడ్డి గురుస్వామి ఆధ్వర్యం వహించగా, వేదఘోషల నడుమ మొదలైన ఈ శుభకార్యక్రమం భక్తుల మనసులను మంత్రముగ్ధుల్ని చేసింది. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీ దత్తాత్రేయ స్వామివారి దర్శనంతో పరవశించిపోయారు.
పూజా కార్యక్రమాలు ఉదయం అర్చకులు బాలాజీ శర్మ నేతృత్వంలో సంప్రదాయరీతిలో వేడుకగా జరిగాయి. ఆలయ ప్రాంగణమంతా వేదమంత్రాల ధ్వనులతో మార్మోగింది.
అదే విధంగా సాయంత్రం సమయంలో అర్చకులు నరసింహమూర్తి ఆధ్వర్యంలో దత్త రక్ష మంత్ర హోమం ఘనంగా నిర్వహించబడింది. ఆ గర్భగృహ సమీపంలో కొలువైన యజ్ఞాగ్నిలో నుండి ఎగిసిన పవిత్రమైన జ్వాలలు, భక్తుల మనసులు ప్రశాంతతతో నింపాయి..

ఈ మహోత్సవం ద్వారా గురు కృప అందుకోవాలనే ఆశతో వేలాది మంది భక్తులు దత్త పీఠాన్ని సందర్శించగా, పీఠం పరిసరాలు ఆధ్యాత్మిక శాంతితో నిండిపోయాయి. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాల పంపిణీతో కార్యక్రమం ముగిసింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Anaparthi Audumbara Peetham lit

You cannot copy content of this page

Scroll to Top