ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 01 13 at 10.47.51 AM

TRINETHRAM NEWS

Trinethram News : జోగులాంబ గద్వాల జిల్లా:

పదవ బెటాలినికి ఎదురుగా అమెజాన్ జగన్ వోల్వో బస్సు అదుపుతప్పి బోల్తా ఒక మహిళ మృతి మిగతా వాళ్ళు సేఫ్..

బస్సులో సుమారు 35 మంది ఉన్నట్లు సమాచారం..

హైదరాబాద్ మియాపూర్ నుంచి కడపకు వెళ్తుంటే మూడు గంటల సమయంలో ప్రమాదం..

బస్సు పడిన మరుక్షణమే హైవే పెట్రోలింగ్ పోలీసులు, ఇటిక్యాల మండలం పోలీసులు, బస్సు ప్రమాద సంఘటన స్థలం వద్ద ఉన్న వారు కాపాడిన వైనం.

బస్సు బోల్తా పడిన రెండు నిమిషాల్లోనే బస్సులో మంటలు.

బస్సు బోల్తా పడిన వెంటనే ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని అర్ధనాథాలతో బయటపడిన ప్రయాణికులు.

జోగులాంబ గద్వాల జిల్లా:
హైదరాబాదు ( మియాపూర్ నుంచి కడప కు వెళుతున్న అమెజాన్ జగన్ వోల్వో బస్సు బీచుపల్లి కృష్ణ నది దాటిన తర్వాత ఎర్రవల్లి మండలం పదవ బెటాలియన్ సమీపంలో బస్సు బోల్తా పడి ఒక మహిళ మృతి చెందగా మిగతా 30 మందికి పైగా ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.. ఎన్ హెచ్ ఎ ఐ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది బస్సు ప్రమాద సంఘటన దగ్గర ఉన్న వాళ్లు బస్సు ప్రమాదం జరిగిన వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని బస్సు బోల్తా పడి మంటలు చెలరేగిన సందర్భంలో ప్రయాణికులను కాపాడారు. 30 మంది ప్రయాణికులు సేఫ్గా బయట పడ్డారు కానీ ఒక మహిళను కాపాడే ప్రయత్నంలో బస్సులో ఉండి బయటికి రాలేని స్థితిలో చెయ్యి విరుక్కపోవడంతో ఒక మహిళ బస్సులోనే మృతి చెందడం జరిగింది అని ఎన్ హెచ్ ఎ ఐ పెట్రోలింగ్ వారు తెలిపారు.

అమెజాన్ జగన్ వోల్వో బస్సులో ఇద్దరు డ్రైవర్లు శంషుద్దీన్, ఏసెప్ ఉన్నట్లు ఏసేపు అనే డ్రైవర్ హైదరాబాదు నుంచి 12 నుంచి 1:00 మధ్య బయలుదేరి జడ్చర్ల దగ్గరికి వచ్చిన తర్వాత రెండో డ్రైవర్ శంషుద్దీన్ కి ఇవ్వడం జరిగిందని యేసేపు రెస్టు తీసుకున్నట్లు అయితే శంషుద్దీన్ డ్రైవర్ బీచుపల్లి దాటిన తర్వాత పదవ బెటాలియన్ సమీపంలో బస్సు అదుపుతప్పి కింద పడిందని నిద్రమత్తులో లేసి చూసేసరికి ప్రమాదం జరిగిందని బస్సులో 30 పైగా ప్రయాణికులు ఉన్నట్లు అందరిని సేవ్ చేయగా ఒక మహిళ చనిపోయినట్లు డ్రైవర్ ఎసెప్ తెలిపారు. బస్సు ప్రమాదం నుంచి బయట పడిన ప్రయాణికులలో కొంతమంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినట్లు ఇందులో ఇద్దరుకి మేజర్ గా గాయాలైనట్లు మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయినట్లు మిగతా వారందరికీ సేఫ్ గా ఉన్నట్లు ఎన్ హెచ్ ఎ ఐ పెట్రోలింగ్ వరకు తెలిపారు. ప్రత్యక్ష సాక్షి కాంగ్రెస్ నేత గద్వాల్ కు చెందిన కలీం మాట్లాడుతూ.. బస్సులో ఆకారాలు చేస్తూ అందరూ అప్రమత్తమై బయటకు వచ్చారు.. అందరిని కూడా కాపాడే ప్రయత్నం చేశాము.. ఒకరు మాత్రం బస్సులో ఇరుక్కుపోవడంతో ఆ మహిళా ప్రయాణికురాలు సజీవ దహనము అయింది మా కళ్ళముందే అని చెప్పారు.. బయటపడ్డ ప్రయాణికులకు సహాయం చేసి కర్నూలుకు ఇతర ప్రాంతాలకు వెళ్లే వారికి సహాయం చేశాము.. -కాంగ్రెస్ నేత కలీం…

You cannot copy content of this page