
Trinethram News : (విశాఖపట్నం, మార్చి 29): ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నిర్వహణకు సంబంధించి బీసీసీఐ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపినాథ్రెడ్డి వెల్లడించారు. విశాఖలో డాక్టర్ వైయస్సార్ ఎసిఏ వీడిసి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో 31న ఢిల్లీ క్యాపిటల్స్ – చెన్నై సూపర్ కింగ్స్, ఏప్రిల్ 3న ఢిల్లీ క్యాపిటల్స్– కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరగనున్న ఐపీఎల్ మ్యాచ్ దృష్ట్యా శుక్రవారం స్టేడియంలో చేపట్టిన వివిధ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రేక్షకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా పోలీసు అధికారుల సహకారంతో అన్ని చర్యలు తీసుకున్నాం. ఏసీఏ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి నాయకత్వలో నాలుగేళ్లలో మ్యాచ్ల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో అద్భుత విజయాలు సాధించడం వల్లే విశాఖకు ఐపీఎల్ మ్యాచ్లను కేటాయించారని పేర్కొన్నారు. విశాఖ ప్రత్యేకమైన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ల ద్వారా ఇమిడింప చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. బీసీసీఐ ర్యాంకింగ్స్ నివేదికలో ఇక్కడ మ్యాచు
