జూలై 7, 2026

WhatsApp Image 2023 12 11 at 11.33.19 AM

TRINETHRAM NEWS

Trinethram News : రంగారెడ్డి జిల్లా : డిసెంబర్11
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున రాజేందర్ నగర్ పరిధిలోని టాటా నగర్ లో ఉన్న ఓ ప్లాస్టిక్ గోదాములో ప్రమాదవశాత్తు మంటలు అలుముకున్నాయి.

మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో గోదాం పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ వ్యాపించింది. భయాం దోళనకు గురైన స్థానికుల సమాచారంతో హుటా హుటినా అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహా యక చర్యలు చేపట్టింది.

నాలుగు ఫైరింజన్లతో సిబ్బంది మంటలను అదుపు చేశారు. ప్రమాద సమయంలో గోదాంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. సంఘట నాస్థలానికి చేరుకుని పరిశీ లించిన పోలీసులు..ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిదర్యాప్తు చేయనున్నట్లు తెలిపారు…….

You cannot copy content of this page