
New Bar Association : దేవరకొండ డివిజన్ మార్చ్ 28, త్రినేత్రం న్యూస్. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన బార్ అసోసియేషన్ కమిటీకి సన్మానం, జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన అనిత సురేష్ లకు ఘన సన్మానం చేశారు.
బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సన్నాయిల ఉమామహేశ్వర్ ప్రధాన కార్యదర్శిగా వనం జగదీశ్వర్ కోశాధికారిగా ఈడెం రవికుమార్ లను షాలువాతో సత్కరించి మెమొంటోళ్లు అందించి శుభాకాంక్షలు తెలిపారు .జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన ఏకుల అనిత సురేష్ శాలువాతో సత్కరించి మెమొంటో అందించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూమీరంతా భవిష్యత్తులో ఉన్నత పదవులు అలంకరిస్తూ ఉన్నత శిఖరాల అధిరోహిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజాసేవలో ముందుకెళ్తూ ప్రజల మన్నలను పొందాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో పున్న వెంకటేష్ నేత ,డబ్బే కార్ పెంటోజి పున్న బిక్షమయ్య, పెరికేటి శ్రీనివాస్ చారి, రెడ్డి కోటేశ్వరరావు, జూలూరి రేణు గౌడ్,లైబ్రేరియన్ శారద, కె పెద్దిరాజుతదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

