రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి

TRINETHRAM NEWS

Trinethram News : అనంతపురం జిల్లా

రాయదుర్గం లోనీ సిద్దేశ్వర కాలనీకి చెందిన మల్లికార్జున (40) వాల్మీకి నగర్ సమీపంలో రైల్వే పట్టాలు దాటుతుండగా రైలు కింద పడి రెండు కాళ్ళు విరిగిపోయాయి.

క్షతగాత్రుడు మల్లికార్జున కంటి చూపు తక్కువగా ఉండడం తో బళ్ళారి నుంచి రాయదుర్గం వైపు వస్తున్న గూడ్స్ రైలు ను గమనించలేక ప్రమాదవశాత్తు ప్రమాదం చోటు చేసుకుంది.

గమనించిన స్థానికులు బంధువులు క్షతగాత్రుని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.

You cannot copy content of this page

Scroll to Top