TRINETHRAM NEWS

విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకం : సెయింట్ మార్టిన్ 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

ఈరోజు 128 – చింతల్ డివిజన్ శ్రీ సాయి కాలనీలోని సెయింట్ మార్టిన్స్ హై స్కూల్ లో నిర్వహించిన 25వ వార్షికోత్సవ సెలేస్టియల్ క్రెసెండో కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ. వివేకానంద, ఆర్టిస్ట్ పరోడి గురుస్వామి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమన్నారు. అదేవిధంగా విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో శిక్షణ పొందినట్లయితే మానసిక దృఢత్వంతో పాటు శారీరక దృఢత్వాన్ని పొందవచ్చన్నారు. అనంతరం విద్యలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో స్కూల్ వైస్ ప్రెసిడెంట్ జి. చంద్రశేఖర్ యాదవ్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు జి.రాజశేఖర్ యాదవ్, జి. జై కిషన్ యాదవ్, ప్రిన్సిపల్ శ్రీమతి అనిత రావు చెప్యాల తదితరులు పాల్గొన్నారు.