Kanchi Mahender Meet Ramachandra Rao : బిజెపి జిల్లా అధ్యక్షులు రామచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిసిన కంచి మహేందర్

TRINETHRAM NEWS

కూకట్పల్లి జనవరి 28 (త్రినేత్రం న్యూస్) : రాబోయే స్థానిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో బీజేపీ సీనియర్ నాయకులు కంచి మహేందర్ తన కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావుని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సమావేశంలో ప్రస్తుత స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, కార్యకర్తల సమన్వయం తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. బూత్ స్థాయి నుంచి మండల, డివిజన్ స్థాయి వరకు పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరాన్ని ఇరు నేతలు ప్రస్తావించారు. యువత, మహిళలు, వెనుకబడిన వర్గాల్లో పార్టీ ప్రభావాన్ని పెంచే దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్ణయించారు.

ఈ సందర్భంగా కంచి మహేందర్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం అభివృద్ధే బీజేపీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేస్తే రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని సూచనలు చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Kanchi Mahender, who paid a courtesy call on Ramachandra Rao

You cannot copy content of this page

Scroll to Top