Trinethram News : ఈరోజు 126 – జగద్గిరిగుట్ట డివిజన్ జగద్గిరిగుట్ట కొండపై శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన 55వ బ్రహ్మోత్సవ కార్యక్రమంలో భాగంగా శనివారం జరిగిన శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… మహిమాన్విత శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ దర్శన భాగ్యంతో
ప్రతి ఇంటికి ఆనందం, ఐశ్వర్యం చేకూరాలని అన్నారు. బ్రహ్మోత్సవాలలో స్వామి వారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి సౌకర్యం కలగకుండా చూడాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జగన్, మంత్రి సత్యనారాయణ, సురేష్ రెడ్డి, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నరేందర్ రెడ్డి, మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, దేవాలయ కమిటీ డైరెక్టర్లు వేణు గౌడ్, రవీందర్, సంజీవ్ రెడ్డి, బుచ్చిరెడ్డి, రాజు, మహిళా నాయకురాలు ఇందిరాగౌడ్, సీనియర్ నాయకులు విఠల్, దాసు, బాబు గౌడ్, బండ మహేందర్, బ్రహ్మానంద చారి, మల్లేష్ గౌడ్, మెట్ల శ్రీను, ప్రభాకర్, వెంకటేష్, జైహింద్, రాజు, పాపులు గౌడ్, అంజయ్య, శ్రీను, నాగరాజు, జయకృష్ణ, మనోజ్, బిఎస్ఆర్ నాని, సాజిద్, గిరి, హనుమంత్, రాము, చంద్రశేఖర్, త్రివేణి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


