త్రినేత్రం న్యూస్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పట్టువదలని విక్రమార్కుడు అని ఏడిద గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పర్వతిన వీర్రాజు అన్నారు. ఏడిదలో వీర్రాజు ఆధ్వర్యంలో గురువారం రాత్రి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మండపేట నియోజకవర్గాన్ని రాజమహేంద్రవరం కేంద్రంగా తూర్పుగోదావరి జిల్లాలో కలిపేందుకు చేసిన విశేష కృషిని అభినందిస్తూ పార్టీ తీర్మానం చేశారు.
సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నారా లోకేష్ , మండపేట నియోజకవర్గం జనసేన ఇన్చార్జి వేగుళ్ల లీలాకృష్ణ లకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గొడవర్తి సత్యనారాయణ,మేకా జేజిబాబు,పలివెల డానియెలు,చిట్టురి ప్రసాద్,పదం ఆనంద్,రామిశెట్టి రాజా, బండారు రాంబాబు,చల్ల మణికంఠ తదితరులు పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


