తేదీ : 01/01/2026. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, విస్సన్నపేట మండలం, కొర్లమండ గ్రామంలో చెన్నకేశవ స్వామి, పీర్ల అంకమ్మ గురించి పల్నాటి వీరాచారం సందర్భంగా ఆ గ్రామ ప్రజలు గుర్తు చేసుకోవడం జరిగింది.
దేవుని ఆచారం అనేది ఒక అదృష్టం అని అన్నారు. అదేవిధంగా దేవుడు, దేవత మనిషిలో ప్రవేశించడం అంటే మాటలు కాదు అని తెలిపారు. అదృష్టం అంటే దేవునిలో కలిసిపోవడం లేదా దగ్గరగా చూడగలగడమని పేర్కొన్నారు.
అయితే భక్తులకు, ఆచార మంతులకు ఆ పల్నాటి వీరుల ఆరాధన యుద్ధ కాలంలో ఇలవేల్పుగా కనిపించాడని చెప్పారు. వీరులు యుద్ధభూమిలో జై చెన్నకేశవా అని కేకలు వేశారు, పోరాడారు అని సూచించారు. వీరాచారం అనేది భక్తి స్మృతిని తెలుపుతుందన్నారు.
అంకమ్మ తల్లి, శ్రీ కో ర్ల అంకమ్మ తల్లి మహాలక్ష్మి అమ్మ భక్తురాలిగా పేరుగాంచిందని తెలిపారు. ఆమె తన కుమార్తె అంకమ్మతో కలిసి స్వామి సేవలు చేస్తూ వీరుల ఆచారాలను కొనసాగించిందని , ఆమె కళ్ళ నుండి కారు వాళ్ళ అమ్మగా భక్తులు పిలుస్తారని వీరాచారని సాక్ష్యం అన్నారు.
జాతర మహిమ కొర్ల మండలో శ్రీ మరిడి మహాలక్ష్మి అమ్మ, వీర్ల అంకమ్మ జాతరలు ఘనంగా జరుగుతాయని ప్రజల అంటున్నారు. ఈ ఉత్సవాల్లో అంకమ్మ తల్లి గురించి కథలు, అదేవిధంగా ఆ స్వామి వీరాచారాన్ని గుర్తు చేసుకుంటారని , ఇది భక్తిహీనత్వాన్ని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


