తేదీ : 22/12/2025. గుంటూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); అమరావతి ప్రజలకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వరద నివారణ పై కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొత్త పంపింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతి సచివాలయంలో నిర్వహించిన యాబై ఆరు వ సి ఆర్ డి ఏ అథారిటీ సమావేశంలో ఆయన పాల్గొని ఈ నిర్ణయం తీసుకున్నారు. జరీబ్, నాన్ జరీబ్ భూ సమస్యల పరిష్కారానికి కమిటీని నియమిస్తామని అన్నారు.
రాజధాని అమరావతి ప్రాంతంలో ఆధునిక కల్చరల్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని, అదే విధంగా తక్షణమే భూమిని గుర్తించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు ఆయన తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


