WhatsApp Image 2024 01 24 at 7.11.07 PM
Trinethram News : పుల్లలచెరువు: అధికారులపై సస్పెన్షన్ వేటు
పుల్లలచెరువు మండలం కొమరోలు గ్రామపంచాయతీలో జరిగిన ఉపాధి పనుల్లో అవకతవకలకు బాధ్యులను చేస్తూ ఐదుగురు అధికారులను సస్పెన్షన్ చేస్తూ డ్వామా పీడీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏపీవో ఎలీషా, ఈసీ రమేష్ బాబు, కొమరోలు టీఏ రాజ్ కుమార్, కంప్యూటర్ ఆపరేటర్లను సస్పెండ్ చేసినట్లు డ్వామా పీడీ తెలిపారు. ఇటీవల గ్రామంలో ఉపాధి పనులపై అడిట్ జరగగా ఈవిషయం వెలుగులోకి వచ్చినట్లు పీడీ తెలిపారు.
