Trinethram News : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ జీడిమెట్ల పరిధిలోని వుడ్స్ ఎంక్లేవ్ కాలనీ లో సీసీ రోడ్డు పూర్తిగా పాడువటంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బంది అవుతుండడంతో కాలనీ వాసులు నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి ని గత నెల సంప్రదించగా వారి సమ్యసపై స్పందించి. ఇంచార్జి మంత్రివర్యులు శ్రీధర్ బాబు స్పెషల్ ఫండ్స్ ద్వారా సిసి రోడ్డు మంజూరు చేయించిన నియోజకవర్గ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. ఈ సందర్బంగా కాలనీ వాసులు శాలువాతో సత్కరించి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అనంతరం కాలనీ పరిధిలోని శివ ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు బేకు శ్రీనివాస్, కాలనీ అధ్యక్షులు శివరామకృష్ణ, శ్రీహరి రెడ్డి, బిక్షపతి గౌడ్. అనంత రామ్ రెడ్డి. పాండురంగారావు. రాజేందర్ రెడ్డి, శివ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


