త్రినేత్రం న్యూస్: నవంబర్ 30: నెల్లూరు జిల్లా: కావలి :వైసిపి శ్రేణులు రాష్ట్రాలు దాటిన అదే అభిమానం,అదే ప్రేమ ఇటీవలే కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ,గుండెకు సంబందించిన బైపాస్ సర్జరీ జరిగింది. అందులో భాగంగా కావలి నియోజకవర్గం వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అయన ఆరోగ్యం బాగుండాలని త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
అయితే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , బైపాస్ సర్జరీ నుండి త్వరగా కోలుకోవాలని ఎల్లప్పుడు అయన ఆయురారోగ్యాలతో, ఉండాలని కేరళ రాష్ట్రంలో ఉన్న శబరిమల కొండ మీద ఇడుముడి నెత్తిన పెట్టుకొని కాలినడకన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఫ్లెక్సీ తో అయ్యప్ప స్వామి సన్నిధానం వరకు చేరుకొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


