ముఖ్యఅతిథిగా విచ్చేసిన మాజీ శాసనసభ్యులు, డాక్టర్, సత్తి సూర్యనారాయణ రెడ్డి దంపతులు
త్రినేత్రం న్యూస్ నవంబర్, 09. అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు వాడ్రేవు చంద్రశేఖర్ రావు, దుప్పలపూడి గ్రామంలోని శ్రీ చంద్రశేఖర స్వామి దేవాలయంలో స్వామివారికి రూ.6 లక్షల విలువైన వెండి ఆభరణాలను సమర్పించారు.
ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు) – అనపర్తి మండల వైయస్ఆర్సీపీ కన్వీనర్, రాష్ట్ర రెడ్డి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్; నల్లమిల్లి మురళీమోహన బాలకృష్ణ రెడ్డి (మురళి) – వైయస్ఆర్సీపీ అనపర్తి టౌన్ అధ్యక్షులు; నల్లమిల్లి వెంకటరెడ్డి (నేషనల్ వెంకటరెడ్డి); వల్లభశెట్టి రామ్ సతీష్ – గ్రామ సర్పంచ్; చిలకమర్తి శ్రీను, వల్లభశెట్టి శ్రీను, దొండపాటి మణికంఠ, వల్లభశెట్టి ధర్మరాజు, జంపా రాజు, ఓగిరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


