TRINETHRAM NEWS

అయోధ్యలో సోమవారం జరిగే బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మహోత్సవంలో చీరాలకు చెందిన ప్రొఫెసర్ అన్నదానం చిదంబర శాస్త్రి ముఖ్య భూమిక పోషించారు.బాల రాముడి విగ్రహ ప్రతిష్టాపన జరిగే చోట అమర్చడానికి ఆయన శ్రీరామ యంత్రాన్ని రూపొందించి ట్రస్ట్ కి అప్పగించారు.ఈ యంత్రం పైనే ఇప్పుడు బాల రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు.ఈ యంత్రంలో ఉండే మంత్ర బలం రాముని ఆకర్షణ శక్తిని మరింత పెంచుతుందని శాస్త్రి చెప్పారు.