Deputy CEO Inspects : జేగురుపాడులో ఇంటింటికి చెత్తసేకరణను పరిశీలించిన డిప్యూటీ సీఈవో

TRINETHRAM NEWS

త్రినేత్రo న్యూస్. కడియం మండలం జేగురుపాడు గ్రామంలో జరుగుచున్న ఇంటింటికి చెత్త సేకరణ, చెత్త నుండి సంపద తయారీ వంటి పనులను బుధవారం డిప్యూటీ సీఈవో రామ్ గోపాల్ పరిశీలించారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఈ చెత్త సేకరణ కార్యక్రమం అమలుపై ఆ గ్రామస్తులను, పరిశుద్య కార్మికులను అడిగి తెలుసుకున్నారు. అలాగే చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం పనితీరును కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, ఇంచార్జ్ ఎంపీడీవో సుబ్బారావు, డిప్యూటీ ఎంపీడీవో ఎన్.శ్రీనివాసరావు, కార్యదర్శి అయినవిల్లి శ్రీనివాసరావు, మండలపరిషత్ సీనియర్ అసిస్టెంట్ దాస్,సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Deputy CEO inspects

You cannot copy content of this page

Scroll to Top