Trinethram News : దేశంలోని రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవి ఉపరాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను విడుదల చేసింది.
ఈసీ ప్రకారం, ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. అదే రోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంటు సభ్యులు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనవచ్చు. పోలింగ్ ముగిసిన అనంతరం అదే రోజు ఓట్ల లెక్కింపు (కౌంటింగ్) జరగనుంది. అదే రోజు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది.
ఈ ఎన్నికలకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ ఆగస్టు 7న విడుదల చేయనున్నారు. అభ్యర్థులు ఆగస్టు 21 వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. అయితే, తమ నామినేషన్ను వెనక్కి తీసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు 25గా నిర్ణయించబడింది.
ఉపరాష్ట్రపతి ఎన్నికలు 2025 సెప్టెంబర్ 9న జరగనున్నాయి. అదే రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. వెంటనే కౌంటింగ్ పూర్తయ్యి ఫలితాలు ప్రకటించబడతాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


