Trinethra News : అజ్మేర్ రైల్వే డివిజన్లోని సెంద్ర స్టేషన్ సమీపంలో గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ రైలులో అకస్మాత్తుగా ఇంజిన్ మంటలు చెలరేగాయి. వెంటనే పొగలు బోగీల్లోకి వ్యాపించడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. ప్రమాదానికి గల కారణాలు ప్రస్తుతం గుర్తించాల్సి ఉంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


