డిండి ( గుండ్ల పల్లి) జులై 17 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో వర్షాలు కురావాలని ప్రజలు వరద పాశం పోశారు. చెన్నయ్య బండమీద చెన్నకేశవ స్వామికి నైవేద్యం సమర్పించారు. రైతులు గ్రామస్తులు పిల్లలు ర్యాలీగా బయలుదేరి వర్షాలు కురవాలని భగవంతున్ని ప్రార్థించారు.
వర్షా బావా పరిస్థితిలో నాటిన విత్తనాలు ఎండలకు ఎండిపోతున్నాయని వర్షాలు కురవాలని, వరనుడు కరకరించాలని వరద పాశం పోసామనిగ్రామస్తులు రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు నేస్తం కమిటీ సభ్యులు, నాయకులు పిల్లలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


