Srisailam Reservoir : ఓపెన్

TRINETHRAM NEWS

తేదీ : 06/07/2025.. నంద్యాల జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, శ్రీశైలం రిజర్వాయర్ కు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి ఒకటి.ఎనభై ఎనిమిది లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో క్రస్ట్ గేట్లు తెరిచేందుకు సంబంధిత అధికారులు సిద్ధమవుతున్నారు. డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులకు గాను ప్రస్తుతం ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది అడుగుల నీరు ఉంది. దీంతో ఎనిమిది,తొమ్మిది తేదీలలో గేట్లు ఓపెన్ చేసి దిగువకు నీరు విడుదల చేసే అవకాశం ఉంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top