తేదీ : 02/07/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పాలకొల్లు నియోజకవర్గం లో ఇంటింటికి టిడిపి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అని జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తూనే ప్రజలకు ప్రగతిని అందించాలనే లక్ష్యంతోనే ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుతూ ఒక మంచి ప్రభుత్వంగా గుర్తింపు తెచ్చుకున్నామని సూచించడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


