Kolusu Parthasarathy : ప్రజలను మోసం చేశాడు

TRINETHRAM NEWS

తేదీ : 28/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నూజివీడు నియోజకవర్గం , ఎమ్మెల్యే, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ వైసిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఉపయోగపడేందుకు నిర్మించినటువంటి టిడ్కో ఇళ్ళ ను జగన్ తుప్పుపట్టేలా చేశారని, అగ్రహం వ్యక్తం చేశారు.

అమాయక ప్రజలను జగన్ మోసం చేశాడని మండిపడ్డారు. పేదల పేరు మీద బ్యాంకు రుణాలు తీసుకొని వాళ్లను ఇబ్బందులకు గురిచేసాడని విమర్శించారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైనటువంటి నిరుపేద ప్రతి ఒక్క కుటుంబానికి ఇల్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

He cheated the people.

You cannot copy content of this page

Scroll to Top