Ramavat Ravindra Kumar : చిత్రియాల సత్తమ్మ మృతి బాధాకరం

TRINETHRAM NEWS

బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
దేవరకొండ జూన్ 26 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండల విలేకరు శంకర్ గౌడ్ తల్లి చిత్రియాల సత్తమ్మ బాధాకరం అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, మాజీ దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం చందంపేట లో సత్తమ్మ మృతి దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆమె కుటుంబ సభ్యులకు పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. . సత్తమ్మ మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. సత్తమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు.ఆయన వెంట సర్పంచుల మాజీ రాష్ట్ర కార్యదర్శి జర్పుల లోక్య నాయక్,బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కేతావత్ శంకర్ నాయక్, రామావత్ మోహన్ కృష్ణ, గోసుల శివ, బొడ్డుపల్లి కృష్ణ,బలవద్ది రాజ్, శ్రీశైలం,రమేష్ నాయక్,నాయకులు తదితరులు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chitriyala Satthamma's death is sad

You cannot copy content of this page

Scroll to Top