Trinethram News : జూరాల ప్రాజెక్టులోని 9వ నంబర్ గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.. ఒక్క ఇటుక పేర్చడం కూడా చేతకాని ముఖ్యమంత్రికి కనీసం ఉన్న ప్రాజెక్టు నిర్వహణ కూడా రాకపోవడం సిగ్గుచేటు
ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్ వే వద్ద మెయింటెనెన్స్ పనులు చేయించకపోవడం రేవంత్ సర్కారు నిర్లిప్తత స్పష్టంగా కనిపిస్తోంది.. జూరాలకు క్రమంగా వరద ఉదృతి పెరుగుతుండడంతో రేవంత్ రెడ్డి, మంత్రులు ఇప్పటికైనా మొద్దునిద్ర వీడాలి
ప్రభుత్వం వెంటనే దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడంతోపాటు, ఎగువ నుంచి పెరుగుతున్న ఇన్ ఫ్లోను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పకడ్బందీగా వ్యవహరించాలి.. జూరాల ప్రాజెక్టుకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి – కేటీఆర్…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


