డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. దిండి మండల పరిధిలోని తోకలాపూర్ గ్రామంలోని మండల ప్రాథమిక పాఠశాల కు భారీ విరాళం ఇచ్చిన గుంత శ్రీనివాస్ కు శుక్రవారం నాడు ఘన సన్మాన కార్యక్రమం జరిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దేవరకొండ ఏఎస్పి పి మౌనిక పాల్గొన్నారు. విద్యార్థులు చదువుకోవడానికి పేదరికం అడ్డు కాదని ఆమె అన్నారు. ఈ కార్యక్రమానికి స్కూల్ హెచ్ఎం రాజేందర్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన అభినందన సభలో ఆమె మాట్లాడారు.
పాఠశాలల మౌలిక వసతుల కల్పన కోసం రూపాయలు 20 లక్షల భారీ విరాళం అందజేసిన దాత గుంత శ్రీనివాస్ దంపతులను ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమానికి తహసిల్దార్ అంబటి ఆంజనేయులు, ఎంఈఓ గోప్యా నాయక్ , ఎస్సై రాజు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


