పాల్గొన్న ఎమ్మెల్యే వేగుళ్ళ…
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, అనపర్తి నుండి అర్తమూరు వరకు రూ.1 కోటి 60 లక్షల రూపాయల నిధులతో బి.టి. రోడ్ నిర్మాణానికి బుధవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, శంఖుస్ధాపన చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, తూర్పుగోదావరి జిల్లా బిజెపి అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మండపేట మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పాలకమండలి మాజీ సభ్యులు పడాల సుబ్బారెడ్డి, తాపేశ్వరం పి.ఎ.సి.ఎస్ అధ్యక్షులు పడాల రామకృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ కర్రి సత్యనారాయణ రెడ్డి (జంబయ్య), పొలమూరి నీటి సంఘం అధ్యక్షులు చిర్ల ఆదిరెడ్డి (బాబులు), కుతులూరు నీటీ సంఘం ఉపాధ్యక్షులు మల్లిడి సత్తిరెడి (సత్తిరాజు), తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


