పెనుమార్పికి హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజానీకం

TRINETHRAM NEWS

తేదీ : 10/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గుడివాడలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. యువ డీఎస్పీ ఆధ్వర్యంలో క్రమశిక్షణగా మారి , రాత్రి పదకొండు గంటలకే ఇండ్లకు ట్రూ విల్లర్ పై ఎవరైతే తమ తమ కార్యకలాపాలకు వెళ్తున్నారో వాళ్లు చేరుకోవడం జరుగుతుంది. మద్యం అమ్మకాలు కూడా కట్టడి చేస్తున్నారు. బర్తడే పార్టీలు లేవు, రోడ్లపై సందడి కనిపించడం లేదు. భయంకరంగా శబ్దం చేసే బైక్ సైలెన్సర్ మూగబోయాయి. పట్టణం నలుమూలల పోలీస్ బందోబస్తు ఏర్పడింది.

రాత్రి సమయంలో విహరించి , పలు కేసుల్లో ఉన్న వాళ్లను గుర్తించేందుకు ఫింగర్ ప్రింట్ సిస్టం మొదలుపెట్టారు. ఎవరైనా అనుమానస్పదంగా కనిపిస్తే నేరుగా జైలుకే పోలీసులు తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా యువత విషయంలో రాజకీయ ఒత్తిడి లేకపోవడం సంతోషకరమైన విషయం. మార్పుకు గుడివాడ శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా అర్ధరాత్రి మద్యం అమ్మకాలు, జరిగాయి. వారిని పూర్తిగా ఈ కూటమి ప్రభుత్వం నిషేధించి చర్యలు చేపట్టింది.
మత్తు మారకద్రవ్యాలు, గంజాయి, వ్యభిచారం అనే మాట అసలు కు పుల్ స్టాప్ పెట్టడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలపై మూడవ నేత్రం డ్రోన్ కెమెరా లు పనిచేయడం వలన పేకాట, కోడిపందాలు, సత్ప్రవర్తనతో రౌడీ షీట్స్ సస్పెక్స్ తదితరులు లాంటివి ఈ కూటమి ప్రభుత్వంలో కనిపించకపోవడం వలన ఈ విధంగా గుడివాడలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడినందుకు, పెను మార్పుకి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

People are cheering for

You cannot copy content of this page

Scroll to Top