తేదీ : 09/06/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , పాలకొల్లు పదవ వార్డు యందు లక్ష్మీ నగర్ పార్కు పక్క వీధిలో ప్రజలు నీటి కష్టాలను ఎదుర్కొంటున్నామని తెలపడం జరిగింది. కుళాయి నీళ్లు రాక వాటర్ ట్యాంకు కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. రెండు రోజుల నుండి నీళ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని బాధపడుతున్నారు. సంబంధిత అధికారులు తక్షణమే చొరవ తీసుకుని తమ సమస్యలను పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


