TRINETHRAM NEWS

Trinethram News : తిరుపతి జనవరి 17
తిరుమల తిరుపతి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ పెరిగింది. ఈ రోజు శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు క్యూ కాంప్లెక్స్‌లో 25 కంపార్టు మెంట్లలో వేచి ఉన్నారు.

దీంతో శ్రీవారిని దర్శించు కోవాడినికి భక్తులకు 16 గంటల సమయం పడు తుంది. స్వామివారికి దర్శించుకుంటూ భక్తులు మొక్కులు చెల్లించకుం టున్నారు.

కాగా, మంగళవారం శ్రీవారి 73,016 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో నిన్న 20,915 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.46కోట్లు వచ్చిందని టిటిడి అధికారు లు వెల్లడించారు.