మర్రి గంగయ్య చెందిన గొరెపిల్లలు ఇటీవల కుక్కల దాడి

TRINETHRAM NEWS

నూజెండ్ల మండలంలోని నూజెండ్ల గ్రామం నందు మర్రి గంగయ్య చెందిన గొరెపిల్లలు ఇటీవల కుక్కల దాడిలో మరణించగా, విషయం తెలుసుకొన్న స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కార్యాలయం నందు నేడు వారికి ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ, ఇలాంటి సంఘటనలు జరగటం దురదుష్టకరం అని అన్నారు. జరిగినది పెద్ద నష్టం అని అందుకు గాను ఈ విషయం ను గౌరవ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి తగిన న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు.

You cannot copy content of this page

Scroll to Top