Sharmila : వైఎస్సార్ లాగా జగన్ ఆ మాట ఎందుకు చెప్పలేకపోతున్నారు?

TRINETHRAM NEWS

మద్యం కేసులో తప్పు చేయకుంటే జగన్ ఎందుకు వెనుకాడుతున్నారన్న షర్మిల

ఏ విచారణకైనా సిద్ధమని జగన్ ఎందుకు చెప్పడం లేదని నిలదీత

విచారణకు సిద్ధపడండి, నిర్దోషిత్వం
నిరూపించుకోండి అంటూ జగన్ కు హితవు

Trinethram News : వైసీపీ అధినేత జగన్ పై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మద్యం కేసులో తాను నిర్దోషినని చెబుతున్న జగన్, తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి గారిలా ‘తప్పుంటే ఉరితీయండి’ అని ధైర్యంగా ఎందుకు ప్రకటించడం లేదని ఆమె సూటిగా ప్రశ్నించారు. ఏ విచారణకైనా సిద్ధమని చెప్పలేని పరిస్థితిలోనే జగన్ ఉన్నారని షర్మిల ఆరోపించారు.

రాష్ట్రంలో మద్యం విధానానికి సంబంధించి వస్తున్న ఆరోపణలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ, తాను ఏ తప్పూ చేయలేదని అంటున్నారని షర్మిల గుర్తుచేశారు. “మీరు నిజంగా నిర్దోషి అయితే, మీ తండ్రి రాజశేఖరరెడ్డి గారిలా ‘నా తప్పుంటే నన్ను ఉరితీయండి’ అని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఏ విచారణకైనా సిద్ధమని, సీబీఐతోనా లేక సిట్టింగ్ జడ్జితోనా దర్యాప్తు చేయించుకోమని మీరు ఎందుకు ధైర్యంగా చెప్పడం లేదు?” అని షర్మిల నిలదీశారు. అసెంబ్లీ వేదికగా రికార్డుల్లో ఈ విషయాన్ని చెప్పాలని, అలా చెప్పలేకపోవడమే ఆయన తప్పుచేశారనడానికి నిదర్శనమని ప్రజలు భావిస్తున్నారని ఆమె అన్నారు.

పోలీసుల గురించి జగన్ చేసిన వ్యాఖ్యలను కూడా షర్మిల తీవ్రంగా ఖండించారు. “గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, పోలీసుల బట్టలు ఊడదీస్తాం, తరిమి తరిమి కొడతాం, విదేశాలకు వెళ్లినా వదిలిపెట్టం వంటి మాటలు మాట్లాడటం తగదు” అని షర్మిల పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పోలీసు వ్యవస్థను జగన్ ఎలా వాడుకున్నారో, ముఖ్యంగా రఘురామ వంటి వారి విషయంలో ఎలా ప్రవర్తించారో ప్రజలు మర్చిపోలేదని ఆమె వ్యాఖ్యానించారు. అలాంటిది ఇప్పుడు పోలీసుల గురించి తక్కువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.

అసెంబ్లీ సమావేశాలకు జగన్ ఎందుకు హాజరు కావడం లేదని షర్మిల ప్రశ్నించారు. కనీసం మీడియా సమావేశంలోనైనా, మద్యం అమ్మకాలను కేవలం నగదు రూపంలోనే ఎందుకు చేశారనే దానికి ప్రజలు సమాధానం ఆశిస్తున్నారని, ఆ విషయం చెప్పకుండా దాటవేస్తున్నారని విమర్శించారు. తన చుట్టూ ఉన్నవారంతా మంచివారని, మచ్చలేని వారని చెప్పడం, సీబీఐ చేత దోషిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాశ్ రెడ్డి వంటి వారిని ‘అమూల్ బేబీ’, ‘చిన్నవాడు’, ‘ఏమీ తెలియదు’ అంటూ పక్కన పెట్టుకుని తిరగడాన్ని షర్మిల తప్పుబట్టారు. “అలాంటి వారికి మీరు ఇచ్చే సర్టిఫికెట్లు ఎవరికి కావాలి? నిజంగా నిర్దోషి అయితే, వ్యవస్థలో నిరూపించుకోవడానికి మార్గాలున్నాయి, కానీ మీరు ఆ పని చేయడం లేదు” అని షర్మిల అన్నారు. ఈ వైఖరే జగన్ దోషి అనే భావనను ప్రజల్లో కలిగిస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Why can't Jagan say

You cannot copy content of this page

Scroll to Top