దేవరకొండ మే 22 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని డిండి రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన న్యూ సన్షైన్ డ్రైక్లీనింగ్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై, షాప్ ను ప్రారంభించి,షాప్ యజమానికి శుభాకాంక్షలు తెలిపిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్.. అనంతరం ఎమ్మెల్యే ని షాప్ యజమాని శాలువాతో సత్కరించారు.
అనంతరం దేవరకొండ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర విశ్రాంత ఉద్యోగుల సంఘం మొదటి అంతస్తుల భవన నిర్మాణాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. దేవరకొండ పట్టణంలోని PPR కన్వెన్షన్ హాల్ లో జరిగిన వివాహా మహోత్సవ వేడుకల్లో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహా,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ముక్కామల్ల వెంకటయ్య గౌడ్, PACs చైర్మన్ కొండ్ర శ్రీశైలం యాదవ్,పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు యునూస్,మాజీ ఎంపీపీలు ఏడ్పుల గోవింద్ యాదవ్, బిక్కు నాయక్,నాయకులు మాల్ రెడ్డి రవీందర్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ నియోజక వర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ, యువ నాయకులు మెడ సైదులు, సుభాష్ నాయక్,ప్రజా ప్రతినిధులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు,విశ్రాంతి ఉద్యోగుల సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


