దేవరకొండ మే 20 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోనికొండమల్లేపల్లి మండలంలోని చెన్నారం గ్రామంలో నిర్వహించిన బొడ్రాయి (నాభిశిల )ప్రతిష్టాపన ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని, గ్రామ దేవతలను దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించిన దేవరకొండ శాసన సభ్యులు నేనావత్ బాలు నాయక్
దేవరకొండ నియోజక వర్గ ప్రాంత ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అనంతరం మార్గమధ్యలో పొలంలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించి, వారి సమస్యలు అడిగి తెలుసుకోని, సత్వరమే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
జ్యోతిపురి తండాలో జరిగిన వివాహ వేడుకల్లో పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ నాయిని జమున మాధవ రెడ్డి,నల్గొండ పార్లమెంట్ కోఆర్డినేటర్ సిరాజ్ ఖాన్, PACs చైర్మన్ డాక్టర్ వేణుధర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు వేమన్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ కాసర్ల వేంకటేశ్వర్లు, బంజారా సంఘం నాయకులు లాలు నాయక్, మాజీ సర్పంచులు దామోదర్ రెడ్డి, రాములు, భీమ్ సింగ్,నాయకులు శ్రీనివాస్ చారి, నర్సింహా చారి, కృష్ణ రెడ్డి, వెంకటేష్ యాదవ్, శుక్య ,జగన్,రత్నం,కబీర్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


