తిరుపతి వ్యక్తికి పాకిస్థాన్ నుంచి బెదిరింపు కాల్
Trinethram News : పగడాల త్రిలోక్ కుమార్కు పాక్ నుంచి బెదిరింపు కాల్ – వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చిన బాధితుడు..
పాకిస్థాన్కు చెందిన అధికారి పేరిట తిరుపతికి చెందిన వ్యక్తికి ఓ ఫోన్కాల్ రావడం కలకలం రేకిత్తించింది. తిరుపతికి చెందిన పగడాల త్రిలోక్ కుమార్ స్థానికంగా గాజుల వ్యాపారం చేస్తుంటారు. బుధవారం నాడు ఉదయం ద్విచక్ర వాహనంపై తిరుమలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో 92 32925 27504 నంబర్ నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది.
కుటుంబ సభ్యుల పేర్లు చెప్పి ‘మీరు ఏం చేస్తున్నారో మాకు తెలుసు. జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మీ ఇంటిపై బాంబు వేసి పేల్చేస్తాం’ అని త్రిలోక్ కుమార్ని ఫోన్లో హెచ్చరించారు. దీంతో వెంటనే ఆయన డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీనిపై సీఐ రామ్కిషోర్ స్పందిస్తూ పాకిస్థాన్కు చెందిన వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోందని చెప్పారు. దర్యాప్తు అనంతరం పూర్తి విషయాలు వెలుగులోకి వస్తాయని సీఐ పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


