అల్లూరి జిల్లా త్రినేత్రం న్యూస్ పాడేరు: ఏప్రిల్ 24: జనసేన పార్టీ పాడేరు కార్యాలయంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య అధ్యక్షతన కార్యక్రమం కొనసాగింది.
సభ్యత్వ నమోదు చేసిన వాలంటీర్ల కృషిని గౌరవిస్తూ, వారికి ప్రత్యేక కిట్లు అందించారు. ప్రతి జనసైనికుడు, వీర మహిళలకు ఈ కిట్లు అందేలా చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా గంగులయ్య మాట్లాడుతూ, “ప్రతి కార్యకర్త విశేషమైనవాడు. ఈ కిట్లు వారి సేవా యాత్రలో ఉపయోగపడతాయి,” అని పేర్కొన్నారు.
అంతేకాకుండా, ప్రతి క్రియాశీలక సభ్యునికి పార్టీ అధ్యక్షులు పంపిన ప్రత్యేక లెటర్ ద్వారా అభిమానం, ఆదరణ వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల్లో వాతావరణం అనుకూలించకపోయినా, వాలంటీర్లు తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో విశాఖ రూరల్ జిల్లా ఉపాధ్యక్షురాలు కిట్లంగి పద్మ, జిల్లా కార్యదర్శి ఉల్లి సీతారాం, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ గొర్లె వీరవెంకట్, అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత, ఐటీ ఇంచార్జ్ సాలేబు అశోక్, కోఆర్డినేటర్ సీ.హెచ్. అనిల్ కుమార్, పాడేరు మండల అధ్యక్షులు నందోలి మురళీ, జీ. మాడుగుల మండల అధ్యక్షులు మాసాడి భీమన్న, కృష్ణ, ఉపాధ్యక్షులు సీసాల భూపాల్, సీనియర్ నాయకులు పాంగీ శివాజీ, చరణ్, ముదిలి సుబ్బారావు, అప్పలరాజు, కుంచె దేవేంద్ర ప్రసాద్, పవన్, బీరం నాయకులు తల్లె త్రిమూర్తులు, జి. ప్రశాంత్, చిన్ని రాజబాబు, ఉల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
జనసేన సిద్ధాంతాలను ప్రజల్లో విస్తృతంగా విస్తరించేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతగా కృషి చేయాలని జనసేన నాయకత్వం పిలుపునిచ్చింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


