డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 19 త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలో నేడు అంగన్వాడి కేంద్రం 1 లో సామాజిక వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ వేడుకల కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సూపర్వైజర్ రేణుక వచ్చి ఈ కార్యక్రమం గురించి మాట్లాడుతూ ఈరోజు శ్రీమంత కార్యక్రమం డిండి అంగన్వాడి కేంద్రం 1లో నిర్వహించడం చాలా సంతోషకరం. ఇందులో భాగంగా బుద్దుడి సoరిన్, మరియు ప్రవీణ్ దంపతులకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
అనంతరం వారితో మాట్లాడుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేస్తూ పోషక ఆహారం ఏ విధంగా తీసుకోవాలో వివరించడం జరిగింది. డిండి మండల కేంద్రంలో ఇదే తరహాలో ఏమంత కార్యక్రమం లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు బలుముల చంద్రకళ, సత్యవాణి, ఆయా నాగమణి, గర్భిణీ బాలింతలు పుష్పలత, మమత, పల్లవి, రిత్విక, నాగమణి, అంజమ్మ, మరియు అంగన్వాడీ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


