Trinethram News : వక్ఫ్ సవరణ చట్టం చేసినందుకు దావూదీ బోహ్రా కమ్యూనిటీ ప్రతినిధి బృందం ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపింది. గురువారం ప్రధాని మోదీని కలిసిన బృంద సభ్యులు ఈ కొత్త చట్టంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఇది తమ సమాజం తరఫున చాలా కాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ అని వారు చెప్పారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ అనే ప్రధానమంత్రి దార్శనికతపై వారు విశ్వాసం వ్యక్తం చేశారు.
కాగా ఓ వైపు దేశవ్యాప్తంగా ముస్లింలు వక్ఫ్ సవరణ చట్టంపై వ్యతిరేకత వ్యక్తం చేస్తుంటే.. దావూదీ బోహ్రా కమ్యూనిటీ వాళ్లు ప్రధాని మోదీని కలిసి కృతజ్ఞతలు తెలియజేయండి ప్రాధాన్యతను సంతరించుకుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


