Regam Matsya Lingam : అరకువేలిలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

TRINETHRAM NEWS

అంబేద్కర్ యావత్ ప్రపంచానికే ఆదర్శప్రాయం : రేగం మత్స్య లింగం

ఆంధ్రప్రదేశ్ అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 15 : ఈరోజు అరకు నియోజకవర్గం,అరకు వ్యాలీ మండలంలో భారత రత్న భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక ఎమ్మార్వో ఆఫీస్ ప్రాంగణం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ శ్రేణులతో కలిసి_ అరకు శాసనసభ్యులు రేగం మత్స్య లింగం ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యావత్ ప్రపంచానికి ఆదర్శనీయమని, ఆయన రచించిన రాజ్యంగం అన్ని వర్గాల వారికి సమానత్వ హక్కులు కల్పించిందని తెలిసి,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహోన్నతమైన వ్యక్తిని,ప్రపంచానికే ఆదర్శన్యమైన రాజ్యాంగాన్ని రచించిన అపార మేధావి, విద్యావంతులని కొనియాడుతూ,మనమందరం జీవితాంతం అంబేద్కర్ కి రుణపడి ఉండాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో అరకు వ్యాలీ మండలం జడ్పిటిసి సభ్యురాలు శ్రీమతి శెట్టి రోషిణీ స్టేట్ ఎస్టి సెల్ ప్రధాన కార్యదర్శి పాంగి చిన్నారావు ఏ.ఎస్.ఆర్ జిల్లా వైసీపీ మేధావి వర్గ అధ్యక్షుడు కిల్లో రాజా రమేష్ బోస్ వైసిపి అల్లూరి సీతారామరాజు జిల్లా అఫీషియల్ స్పోక్స్ పర్సన్ కోర్ర గాసి వైసిపి అరకు వ్యాలీ మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి వైసిపి డుంబ్రిగూడ మండల పార్టీ అధ్యక్షుడు పాంగి పరశురాం అరకు వ్యాలీ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రంజపల్లి ఉషారాణి డుంబ్రిగూడ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు బాకా ఈశ్వరి మాజీ ఉమ్మడి విశాఖ పట్నం ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కమ్మిడి అశోక్ అరకు నియోజకవర్గం వైసిపి సోషల్ మీడియా ఇంచార్జ్ కొర్రా రమేష్ (రామ్) అరకు వ్యాలీ టౌన్ ఎంపీటీసీ దూరియా ఆనంద్ కుమార్ పెదలబుడు సిగ్మెంట్ టు ఎంపీటీసీ సమర్ధి శత్రుగును సీనియర్ నాయకులు శెట్టి అప్పాలు ,పల్టాసింగి విజయ్ కుమార్,గుడివాడ ప్రకాష్ ,ముఖి సాంబయ్య ,నరసింహారావు,అంబేద్కర్ సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ambedkar Jayanti celebrations in Arakuveli

You cannot copy content of this page

Scroll to Top