వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, అంటరానితనాన్ని రూపుమాపడానికి కృషిచేసిన సామాజిక సంస్కర్త, మహిళా విద్యాభివృద్ధికి మార్గదర్శి,నిత్య స్ఫూర్తిప్రదాత మహాత్మా జ్యోతిబా ఫూలే 198వ జయంతి సందర్భంగా నేడు పరిగి పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి సిపిఎం ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య,నాయకులు ఎండీ.హబీబ్, సత్యయ్య, రఘురాo, రాంచెంద్రయ్య, ఎల్లప్ప, నర్సిములు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


