Chief Minister’s Assistant : ముఖ్యమంత్రి సహాయనిది

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 19 : కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్ (118) చెందిన జి .రామకృష్ణ కి 60,000/- రూపాయల చెక్కు మంజూరైనవి .కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిదికి ధరకాస్తూ చేసుకోగ 60,000/- రూపాయలు మంజురు అయినవి. అట్టి చెక్కులను బండి రమేష్ చేతులమీదుగా బాలానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం రోజున అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ వైస్ చైర్మన్ లక్ష్మయ్య , మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్ప రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు దండుగుల యాదగిరి, డివిజన్ అధ్యక్షులు ప్రవీణ్, కృష్ణా రాజ్ పుత్ ,మోయిజుద్దీన్ ,సతీష్ గౌడ్, కుక్కల రమేష్, మల్లికార్జున యాదవ్, మధు గౌడ్, మేకల రమేష్, రమేష్ ,సునీల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు బండి రమేష్ కి కృతజ్ఞతలలు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister's Assistant

You cannot copy content of this page

Scroll to Top