MLHP : ఎం.ఎల్. హెచ్.పి. లకు ఉద్యోగ భద్రత కల్పించి, 44 వేల వేతనం వెంటనే ప్రభుత్వం ఇవ్వాలి

TRINETHRAM NEWS

జనగాం జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. (తేదీ 18.3.2025)

ఏఐటీయూసీ లో చేరిన ఎం.ఎల్. హెచ్.పి. ఉద్యోగులు..

ఎన్. హెచ్. ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

నేషనల్ హెల్త్ మిషన్ లో గత మూడు సంవత్సరాల నుండి ప్రైమరీ హెల్త్ సెంటర్ స్థాయిలో ప్రజా నీకానికి వైద్య సేవలు అందిస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ (ఎం.ఎల్. హెచ్ .పి.)లకు రూ. 44 వేల వేతనం తోపాటు ఉద్యోగ భద్రతను కల్పించాలని నేషనల్ హెల్త్ మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ (ఏఐటీయూసీ అనుబంధం) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షులు సి.హెచ్ రాజారెడ్డి పాల్గొని మాట్లాడారు.. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం ఉద్యోగులందరికీ సమాన పని సమాన వేతనం ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
మంగళవారం రోజున మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్స్ జనగాం జిల్లా స్థాయి సమావేశం గబ్బేట గోపాలరెడ్డి భవన్ లో జ్యోతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రామ రాజేష్ ఖన్నా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ… కనీస వేతన చట్టం ప్రకారం జీతాలు అమలు చేయకుండా అతి తక్కువ జీతాలతో విధులు నిర్వహిస్తున్నారని అన్నారు. డ్యూటీ చార్ట్ ప్రకారం విధులు చేయించకుండా అనేక రకాల క్రింది స్థాయి పనులను వారిపై రుద్దుతూ పని భారాన్ని పెంచటం అన్యాయమని ఆయన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. బి.ఎస్సీ. నర్సింగ్, జనరల్ నర్సింగ్ , విద్యార్హతతో, డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నిక చేయబడినటువంటి ఎం. ఎల్ హెచ్. పి ఉద్యోగులకు కనీస వేతనం రూ.44 వేలు
ఇవ్వవలసి ఉండగా కేవలం 29 వేల 900 జీతం మాత్రమే చెల్లిస్తూ అధిక పనిభారాన్ని వారిపై మోపుతూ అన్ని స్థాయిలో పనులు వారితో చేయించుకోవడం అన్యాయమన్నారు. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకూ ఎఐటియూసి అండగా ఉండి పోరాటం నిర్వహిస్తుం దని తెలియజేశారు. ఇతర రాష్ట్రాలలో ఇస్తున్న మాదిరి మన రాష్ట్రంలో కూడా ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న ఉద్యోగులకు 5 శాతం పర్ఫా ర్మెన్స్ బేసిడ్ ఇన్సెంటివ్స్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశం అనంతరం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా కేతవత్ మహేష్ నాయక్ , ఉపాధ్యక్షులుగా పులి లావణ్య, ఉపాధ్యక్షులుగా బొల్లం జెస్సికా, ప్రధాన కార్యదర్శి కీర్తన మరియు ప్రవళిక సహాయ కార్యదర్శి గా ప్రశాంత్ కోశాధికారిగా శిరీష మమత ముఖ్య సలహాదారులుగా గంగరబోయిన జ్యోతి, వర్కింగ్ ప్రెసిడెంట్ పి.లిఖిత రాణి మరియు తదితరులను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ జనగాం జిల్లా అధ్యక్షురాలు గంగరబోయిన జ్యోతి, ప్రధాన కార్యదర్శి ఏ.గణేష్ , ఎమ్.ఎల్.హెచ్.పి.లు మరియు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

M.L. H.P. Govt should provide

You cannot copy content of this page

Scroll to Top