National Rural Employment : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పని అందని ద్రాక్ష లాగా మిగిలిపోయే పరిస్థితి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు. బూర్గంపాడు మండలం సారపాక ప్రాంతంలో ఉపాధి పని ప్రదేశంలో సందర్శించిన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఉపాధి కార్మికులకు కనీసానికి రోజువారి కూలీ 600 ఇవ్వాలని కానీ ప్రభుత్వం నిర్మించిన 300 రూపాయలు కూడా ఇవ్వట్లేదని 150 నుండి 200 వరకే పడుతున్నాయని ఆ ప్రాంతంలో మంచినీళ్లు సహకారం గాని టెంట్లు మెడికల్ కిట్టు ఆటో చార్జీలు ఎటువంటి సహకారాన్ని ప్రభుత్వం అధికారులు అందించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్రంలో బిజెపి ప్రభుత్వం 2014లో అధికారంలో కి వచ్చిన దగ్గరనుండి ఉపాధి పని రోజు రోజు దిగజారుస్తుందని బడ్జెట్లో డబ్బులు కేటాయించట్లేదని కనీసంనికి రెండు లక్షల 50 వేల కోట్లు ఉపాధి పనికి కేటాయించాలి కానీ మోడీ ప్రభుత్వం 86000 కోట్లు కేటాయించి ఆ డబ్బుల్లో 2024న ఉపాధి కార్మికులకు 25 వేల కోట్లు ప్రభుత్వం అప్పు ఉందని 86 వేల కోట్లల్లో 25 వేల కోట్లు తీసేస్తే 61,000 కోట్లు మాత్రమే 2025 26లో కి కేటాయించిన బడ్జెట్ అని అన్నారు

యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు జాతీయ గ్రామీణ ఉపాధి పనికి మంచినీళ్లు సహకారం టెంట్లు గడ్డ పలుగు తట్టలు ఆటో చార్జీలు వాటితో పాటు పనిచేసిన డబ్బులు వారంలో ఎంత పడ్డాయి అనేదానికి ప్లే సెల్పులు ఇచ్చేవారని కానీ ఇప్పుడున్న ప్రభుత్వం వాటిని రద్దుచేసి కనీసానికి మంచినీళ్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదని అన్నారు ఎటువంటి సహకారం అందించకుండా ఉపాధి కార్మికుల్ని ఎండలో గొంతు ఎండిపోయే విధంగా చేస్తున్న అధికారులు అంతేకాదు
ఈ పనిని పూర్తిగా తగ్గించాలని పని లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం పూనుకున్నది ఈ కుట్రని ఉపాధి కార్మికులు సేదించాలని పనిని కాపాడుకోవాలని బడ్జెట్లో కేటాయించకుండా పని భారాన్ని పెంచి రోజుకి రెండు ఫోటోలు పేరుతోటి ఉపాధి కార్మికుల్ని ఎర్రటి ఎండలో 12 గంటల పాటు ఉంటున్నారని కొలతలు పేరు డబ్బులు పడకుండా అన్యాయంగా వరిస్తున్నారని

ఈ పని వచ్చిన విధానమేంటి వీరు చేపిస్తున్న విధానం ఏంటి పని అన్న చూపియండి తిండి అన్న పెట్టండి అనే విధంగా వచ్చిన పనికి ఈ రకమైన తూట్లు పొడుస్తున్నారు ఈ పనికి ఉపాధి కార్మికులను దూరం చేస్తున్నారు ఈ చట్టం రద్దు అవుతే ప్రజలు తిరుగుబాటు చేస్తారని భయంతో వారంతట వారే పని మానేయాలని అనేకమైన ప్రయత్నాలు ఉపాధి కార్మికుల పైన వేసి రుద్దుతున్నారు అఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో తమ్మిశెట్టి వీరమ్మ విజయలక్ష్మి రమణ లక్ష్మణ్ రాందాస్ ధనలక్ష్మి ప్రసన్న పుల్లమ్మ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

National Rural Employment

You cannot copy content of this page

Scroll to Top