త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం బొమ్మూరు లోని జిల్లా పార్టీ కార్యాలయంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అధ్యక్షతన ఘనంగా జరిగింది. జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ఫీజు పోరు కార్యక్రమం పార్టీ శ్రేణులతో దద్దరిల్లింది. కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ గా వెళ్లి కలెక్టరేట్ లో విద్యార్థి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా మాజీ హోంమంత్రి, గోపాలపురం నియోజకవర్గం ఇన్చార్జి తానేటి వనిత, మాజీ మంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు, రాజానగరం నియోజకవర్గ ఇన్చార్జ్ జక్కంపూడి రాజా, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు,
అనపర్తి నియోజకవర్గం ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి, సీనియర్ నాయకులు, పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు జక్కంపూడి విజయలక్ష్మి, యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపాటి షర్మిల రెడ్డి, ఏపీ ఎన్విరాన్మెంట్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ చందన నాగేశ్వర్, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


