జూన్ 26, 2026
TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని రింగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోండ్రు వెంకటరమణ గత పది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. బుధవారం ఆమె దశదినకర్మలకు గాను ప్రముఖ పత్రిక విలేకర్, ఆదివాసీ సంఘం నాయకుడు గడ్డం ఉదయ్ హాజరై కుటుంబ సభ్యులను ఓదార్చి,

కుటుంబ సభ్యులకు రూ. 3,000 విలువచేసే 25 కేజీల బియ్యం, వంట సామాగ్రి బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కోండ్రు సుందర్రావు, కారం రాంబాబు ,కీసరి వెంకటేశ్వర్లు, సోడే బుజ్జి, మడకం రమేష్, సోడే సాయి తదితరులు ఉన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Distribution of essential goods

You cannot copy content of this page